Sunday, July 25, 2010

సద్గురువు-2


ఇదంతా ఎందుకు చెప్పానంటే , అంతటి మహాత్ములకే , తపస్వులకే అంతర్ముఖులై నిశ్చలం గా అదే నిష్ట లో ఉండటం సాధ్యపడలేదు. కాసేపు తెరిపి కోసం బయటికొస్తే ఆ కాసేపటి లోనే బోల్తా కొట్టి పోయినవాడే వున్నాడు. తపస్సు భగ్నమైనవాళ్ళూ వున్నారు. అది అంతటి కష్టమైన పని. అది ఋషీశ్వరులకే సాధ్యపడలేదంటే ఇంక మనం ఎంత జాగ్రత్తగా వుండాలో తెలుసుకోవాలి.
ఉదాహరణకు ఒక రోజు ఒక భక్తురాలు బాబా వద్దకు వచ్చి బాబా ను తన ఇంటికి భోజనానికి రమ్మంది. “ అలాగే తల్లీ! తప్పకుండా వస్తాను. భోజనం కూడా చేస్తాను. కానీ నేను వస్తే మాత్రం ఛీ కొట్టి తరిమేయకు సుమా! “ అని అన్నారు బాబా. బాబా! “ నేను మిమ్మల్ని అలా యెందుకు చేస్తాను? మీరు తప్పక రావాలి" అని ప్రార్ధించి ఆమె ఇంటికి వెళ్ళింది. బాబా కు ఆతిథ్యమివ్వడానికి వంటకాలను సిద్ధం చేసి బాబా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. భోజన సమయం దాటి పోతున్నా బాబా మాత్రం రాలేదు. కానీ ఒక కుక్క వచ్చి బాబా కోసం వండి వడ్డించడానికి సిధ్ధంగా వున్న వంటకాలను ముట్టుకోబోయింది. అది చూచిన ఆమె పొయ్యి లో వున్న కట్టెను తీసి ఆ కుక్క పైకి విసిరింది. ఆ కుక్క తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె చాలా సేపు బాబా కోసం వేచి చూచింది గాని బాబా రాలేదు. తర్వాత ఎంతో బాధగా మసీదు కి వెళ్ళి బాబా తన ఇంటికి భిక్షకు రానందుకు నిష్టూరమాడింది. అప్పుడు బాబా ఆమెతో, “ నేను వస్తే మండుతున్న కట్టే నాపై విసిరావు గదమ్మా! నువ్వే నన్ను గుర్తు పట్టలేదు. సర్వ జీవుల రూపాలలో నేనే వున్నానని గుర్తుంచుకో" అని చెప్పారు.

అలాగే హంసరాజ్ అనేవాడు చాలా కాలం గా ఉబ్బశవ్యాధితో బాధపడుతుండేవాడు. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపోయేసరికి బాబా దగ్గరకు వచ్చి శిరిడి లోనే కొంతకాలమున్నాడు. అతనిని బాబా పుల్లపెరుగు తినవద్దన్నారు. కానీ అతడికి పుల్ల పెరుగంటే చాలా ఇష్టం.అందుకని బాబా తినవద్దన్నా కూడా భార్య చేత బలవంతాన తోడు పెట్టించుకొని తినేవాడు. కానీ సర్వజ్నుడైన బాబా కు తెలియనిదేమున్నది? బాబా చిత్రమైన లీల చేశారు. ప్రతి రోజూ ఆ దంపతులు మసీదులో మధ్యాహ్న హారతి కి హాజరయ్యేవారు.వారు అక్కడికి వచ్చిన సమయం లో ప్రతి రోజూ వీళ్ళ రూమ్ లోకి ఒక పిల్లి వచ్చి పెరుగు తినిపోయేది. మొదటి రోజలా జరిగేసరికి పొరపాటు అనుకొని అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అదేమీ చిత్రమో వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ పిల్లి రావటం, పెరుగు తినిపోవడం ప్రతి రోజూ జరుగుతూనే వుంది. చివరకు అతనికి విసుగు పుట్టి కోపం వచ్చి హారతి కి గూడ పోకుండా దాన్నెలాగైనా రాకుండా చూడాలని, వస్తే కొట్టాలని నిర్ణయించుకొని ఒక కర్ర చేత్తో పట్టుకొని కాపలా కూర్చున్నాడు. సరిగా సమయానికి ఆ పిల్లి రానే వచ్చింది. “ రోజూ పెరుగు తిని పోతావా?” అని అతడు దానిని కర్రతో కొట్టాడు. తర్వాత అతడు మసీదు కి రాగానే బాబా అన్నారు: “ ఇక్కడొక పనికిమాలిన వాడు ఉబ్బసం తో బాధపడుతున్నాడు. వాడిని పుల్లపెరుగు తినవద్దని చెప్పాను. ఎంత చెప్పినా వినకుండా అతడు తింటూనే వుంటే నేనే పిల్లి రూపం లో వెళ్ళి తిని అతడా పెరుగు తినకుండా చూస్తున్నాను. చివరకు వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు" అన్నారు.
అలాగే బల్వంత్ నాచ్నే అన్నగారు బొంబాయి లో శస్త్ర చికిత్స కానీ ఆస్పత్రి లో వున్న సమయం లో వాళ్ళింటికి ఒక సాధువు వచ్చి భిక్ష అడిగాడు. అతని వాడిన గారు అన్నం పెట్టింది. ఇంట్లో బెండకాయ కూర వుంది గానీ అది అందరూ టీనాగా మిగిలినది కదా! అని ఆయనకు వెయ్యలేదు. వేరే కూర వేసింది. కానీ ఆ సాధువు ఆ కూరే అడిగి వేయించుకొని మరీ తిన్నాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అతడు శిరిడీ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు బాబా ఆ సాధువు తామేనని అతనికి తెలిపారు.

ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా ఏ సాధువు కి పెట్టినా తనకే చెందుతుందని, ఏ ప్రాణీని ఆదరించినా , హింసించినా తనకే చెందుతుందనీ నిరూపించారు బాబా.

ఏ దైవానికైనా మొక్కుకొని ఆ మ్రొక్కు ఎగ్గొడితే వాళ్ళు రాగానే వాళ్ళు మ్రొక్కుకున్నంత డబ్బూ అడిగి పుచ్చుకునేవారు. అలాగని ప్రక్కవాడు డబ్బులిస్తే తీసుకునేవారు కాదు.” ఏమయ్యా! వాడిస్తే తీసుకొంటివి, వీడిస్తే తీసుకోలేదేమని అడిగితే " వాడు మ్రొక్కుకొని ఎగ్గొడితే అడిగి తీసుకున్నాను. వీడు మ్రొక్కుకోలేదు గనుక వీడి దగ్గర తీసుకోలేదు. “ అనేవారు. కాబట్టి ఏ దేవతకార్పించినా తనకే చెందిందని, చివరకు మానవమాతృణ్ణి గూడ ఏ విధంగా చూచుకున్నా గూడ అది ఆయనకే చెందిందని భక్తులకు అసంఖ్యాకంగా అటువంటి అనుభూతులను ఇస్తూనే వచ్చారు.అంతటా అన్నీ రూపాలలో వ్యాపించి వుంటాయి. కారణం అన్నీ రూపాలలో ఆయనే వున్నారు గనుక.

ఉదాహరణకు చంద్రాబాయి బొర్కర్ అను భక్తురాలు శిరిడీ కొంతకాలమున్నారు. అప్పుడామే భర్త పండరిపురం లో వున్నాడు. ఒకరోజు బాబా ఆమెతో పండరిపురం లోని ఆమె భర్త వద్దకు వెళ్ళమని చెప్పారు.ఆమె వెంబడే తానుంటానని గూడ చెప్పారు.కానీ ఆమె అక్కడకు వెళ్ళేసరికి ఆయనక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో గూడ తెలియలేదు. ఏమీ చేయాలో తోచని పరిస్థితులలో ఆమె వుండగా, ఒక ఫకీర్ ఆమె వద్దకు వచ్చి మీ వారు ధోండ్ స్టేషన్ లో వున్నారు. వెంటనే వెళ్ళమని చెప్పి టికెట్టు గూడ ఇచ్చారు. అంతేగాక ఆమె భర్తకు గూడ కలలో ఒక ఫకీర్ కనిపించి నీ భార్య ఫలానా రైలు లో వస్తున్నదని చెప్పారు. తర్వాత ఆ ఫకీర్ సాయిబాబానేనని వాళ్ళు తెలుసుకున్నారు.

బాబా ఆదేశం ప్రకారం ఖాండోబా ఆలయం లో వున్న ఉపాసనీ బాబా, బాబా కు నైవేద్యమిచ్చిన తరువాత తను భోజనం చేసేవారు. ఒకరోజు ఉపాసనీ ఆ నైవేద్యాన్ని తీసుకొని పోతూ వున్నప్పుడు ఒక నల్ల కుక్క తోకాడిస్తూ వెంటబడింది. దీనికి పెట్టిన తర్వాత బాబాకు నైవేద్యం పెట్టడం ఎట్లాగా అని దానిని ఛీ కొడుతూ , కసిరి కొడుతూ మసీదు కి వెళ్లారు. వీరు మసీదు కి వెళ్ళి బాబాకు నైవేద్యం ఇవ్వబోతే , “ ఇక్కడికెందుకు తీసుకు వచ్చావు? నేనక్కడ నల్ల కుక్క రూపం లో వున్నాను గదా!” అన్నారు బాబా. కాబట్టి ఇక నుంది గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిద్దామని అనుకొన్నాడు. అంతగా ప్రయత్నించినప్పటికీ, అంత జాగ్రత్తగావుంటున్నప్పటికీ మరలా ఏమారడతను.ఒక రోజు ఇతను వంట చేసుకుంటుంటే బిచ్చమెత్తుకునే వాడొకడు ఆశగానిలబడి దాని వైపు చూస్తున్నాడు. కాబట్టి అది అపవిత్రమౌతుందని తలచి అతనిని కసిరి కొట్టాడు. నైవేద్యం మసీదు కి తీసుకెళ్ళగానే మరలా బాబా కోప్పడ్డారు. “ ఇప్పటి నుండి గుర్తు పెట్టుకో. ఎక్కడ నీ దృష్టి పడుతుందో, అక్కడ నేనున్నా" నని చెప్పారు బాబా. ఈ విధంగా సకల చరాచర విశ్వమంతా తమ రూపమేనని నిరూపించిన శ్రీ సాయిబాబా సమర్థ సద్గురువు.

5 comments:

A K Sastry said...

ఆహా! యెంత చక్కటి 'జీవిత చరిత్ర' చిత్రణలండీ!

Anonymous said...

guru padukulaku vandanalu

murthy said...

చాలా చక్కగా ఉంది మీగురు పాదుక.కృతజ్ఞతలు. నేను ఆధ్యాత్మిక పుస్తకాలను గూర్చి పరిచయం చేద్దామని భక్తి పుస్తకం.బ్లాగ్ స్పాట్.కాం లో ప్రయత్నం చేస్తున్నాను.
దయచేసి మీ అభిప్రాయం తెలుప గలరు.
bhaktipustakam.blogspot.com

Nenu evaru said...

Jai sai mastar

Nenu evaru said...

Without ambition one can starts nothing. Without work one will finishes nothing. The prize will not be given to you. You have to win it. If you want different and better tomorrow you must work harder than yesterday.
-regards Good morning