(కొనసాగింపు)
ఇట్లా నిశ్చయించిన వెనుకను, సదసత్తులలో అనేక భేదాలు వున్నాయని మరువవద్దు. సరి ఇది అని, తప్పు ఇది అని, ముఖ్యమీది అని, అముఖ్యమిది ని, ఉపయోగకరమిది అని, వ్యర్ధమిది అని, సత్యమిది అని, అనృత మిది అని, స్వప్రయోజనమిది అని, పరోపకారమిది అని వివేకం తో తెలుసుకొనుట ఇంకా మిగిలే వుంటుంది.
తప్పును విడిచి సరియైన దానిని అవలంబించటం కష్టం గా తోచరాదు. ఎందుకంటే పరమ గురువును అనుసరించుగోరు వారు ఎన్ని కష్టాలైనా పడి, సరి అయిన దానినే అవలంబించాలని ముందే నిశ్చయం చేసుకొని వుంటారు.
అయినా ఈ శరీరం వేరు, నీవు వేరు. నీ ఇచ్చ ఎల్లప్పుడూ నీ శరీరం కోరు దానిని అనుసరించి వుండదు.
ఈ శరీరం ఏదైనా కోరినచో అది యథార్థంగా నీవు కోరునది అగునా అని నిలిచి యోచింపుము. నీవీశ్వరుడివే. ఈశ్వరుడిచ్చయించునదియే నీవును నిచ్చాయింతువు, గాని నీవు నీ యంతరంగమును లోతున దిగి శోధించి నీలో నుండు ఈశ్వరుని కనుగొని ( ఒకానొక ధీరుడు అమృతత్వమును కోరినవాడై దృష్టిని లోపలకు త్రిప్పి ప్రత్యగాత్మ ను ( లోపల నుండు ఆత్మను ) చూచును ---కఠోపనిషత్తు) వాని మాటను తెలిసికొనవలయును సుమా! అది నీ మాట.
నీ శరీరములే నీవను పొరపాటుపడకు.స్థూల శరీరం నీవు కావు. కామమయ శరీరం నీవు కావు.( ఈ కామమయ, మనోమయ శరీరములు రెండూ చేరి మనోమయ కోశమని వేదాంతులు చెప్తారు) మనోమయ శరీరం నీవు కావు. ఇవి ఒకొక్కటి తనకు కావలసిన దానిని పొండటానికి తానే ఆత్మ అని నటించును. అయినా వానినన్నింటిని తెలుసుకొని వానికన్నింటికి స్వామి నీవని యెరుగుము. (ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. దీనిని తెలుసుకొనువాడు క్షేత్రజ్నుడు (జీవుడు) అని తెలిసినవారు చెప్పుదురు ---గీతా)
చేయవలసిన పని యుండగా శరీరం శ్రమ తీర్చుకోవాలి గాని, తిరుగబోవాలని గాని , భోజనపానములు చేయాలని గాని కోరును. తెలియని వాడు,' ఇవి అన్నీ నేను గోరేదను, నేను వీనిని చేయాలి ' అనుకుంటాడు. తెలిసినవాడు ' వీనిని కోరునది నేను కాదు. ఇది కొంత కాలమట్లుండనిమ్ము' ఏనును. ఎవరికైనా సహాయం చేయుటకు అవకాశం కలిగినప్పుడు శరీరం ' అది నాకెంతో శ్రమ, మరియెవరైనా చేయుదురు గాక' అని పలుమార్లు తలంచినను ' మంచిపని చేయటానికి నీవడ్డు రాకుము' అని వాడు శరీరమునకు ప్రత్యుత్తరమిచ్చును.
దేహం నీకు వాహనం, నీవెక్కు గుర్రం. కావున దానిని ఆదరించి చక్కగా కాపాడాలి. దానికి శక్తికి మించిన పని ఇయ్యరాదు. దానికి పరిశుద్ధములగు అన్నపానములనే ఇచ్చి మేపాలి. లేశ మాత్రమైనా మైల లేక ఉండునట్లతి అతి పరిశుద్ధంగా నెల్లప్పుడూ వుంచాలి. పరిశుద్ధియు, ఆరోగ్యం ను పూర్ణంగా వుండు శరీరం లేనిచో, నీవు విరామము లేని శ్రమకు వోర్చి ఈ కఠినమగు సాధనం చేయజాలవు. ఎట్లన నీ శరీరం నీకు ఎల్లప్పుడును లోబడి వుండవలెను గాని నీవు శరీరమునకు లోబడి యుండరాదు.
కామమయ శరీరానికీ దాని కోరికలుంటాయి. అవి అనేకం. నిన్ను కోపించుకొమంటుంది. పరుష వాక్కులు ఆడమంటుంది. ధనమునకై పేరాశ పాడమంటుంది. ఇతరులకు వుండేది చూచి యోర్వకుండమంటుంది. ఖిన్నుడవై పరవశతనొంద మంటుంది. వీనిని కాక మరి అనేక కోరికలు కోరుతుంది. ఇట్లా కోరుట నీకు కీడు చేయాదలచి కాదు. ఇట్టి బలమగు తాకులు తాకుటయు, సారి సారికీ తాకులు మారు చుండుటయుదానికిష్టం. ఇవి యొక్కటియు నీకేమో అక్కరలేదు. కావున నీ కోరికలలో నీవి యేవి, నీ శరీరం కోరికలేవీ అని వివేచనం చేయాలి.
Showing posts with label జిడ్డు కృష్ణమూర్తి. Show all posts
Showing posts with label జిడ్డు కృష్ణమూర్తి. Show all posts
Friday, July 23, 2010
Thursday, July 22, 2010
పరమ గురు చరణ సన్నిధి

జిడ్డు కృష్ణమూర్తి రాసిన
'పరమ గురు చరణ సన్నిధి'
పుస్తకం నుండి....
ఉపోద్ఘాతం
ఇందులో రాసినవి నా మాటలు కావు. నాకుపదేశించిన పరమ గురువు మాటలు. వారు లేక పోతే నేనేమీ చేసి వుండలేను, గాని వారి సహాయము చే నేను మోక్ష మార్గమును ప్రవేశించాను. నువ్వు అదే మార్గం ప్రవేశింప ఇచ్చ గలవాడవు. కాబట్టి వారు నాకుపదేశించిన వాక్కులు నీకు కూడా సహాయంగా వుండును.ఆ మాటలను అనుష్టించాలి సుమా! ఆ మాటలు సత్యములని, రమణీయములని చెపితే సరిపోదు. చెప్పిన ప్రాకారం జవదాటక అనుష్టించిన గాని నువ్వు కడతేరజాలవు. ఆహారాన్ని చూచి అది బాగుగా వున్నదనుటచే ఆకలిగొన్న వాని ఆకలి తీరదు. చేయి చాచి ఆ అన్నం తినాలి కదా. అట్లానే పరమ గురువుల వాక్కులు వినటం చాలదు. వారు చెప్పే ఒక్కొక్క మాట గమనించి వారు సూచించు ఒక్కొక్క అంశాన్ని గ్రహించి వారు చెప్పినట్లు నడుచుకోవాలి. వారి సూచనల్లో ఒక్కటి గ్రహించకపోయినా, వారి మాటల్లో ఒక్కటి విడిచినా, అది యెప్పటికిని పోయినదే. వారు చెప్పినది మరల చెప్పారు సుమా.
ఈ మార్గమున నాలుగు సాధనాలున్నవి.
1. వివేకం. 2. నిష్కామత్వం ( విరాగం) 3. సదాచారం 4. ప్రేమ. వీనిలో ఒకొక్కదానిని గురించి నాకు పరమ గురువు ఏం ఉపదేశించారో దాన్ని మీకు చెప్తాను.
వివేకం
ఇందులో మొదటి సాధనం వివేకం. ఇది మోక్ష మార్గమున చేర్చు సదసద్వివేకమని కూడా అంటారు. ఇది సరియైనదే. అయినా దీని లో మరి కొంత గొప్ప విశేషముంది. ఆ మార్గారంభమునే కాదు, అడుగడుగునా ప్రతి దినం అభ్యసింపదగినది. పొండదగిన వస్తువులన్నీ ఆ మార్గమునే లభిస్తాయని నేర్చుకున్నావు కాబట్టే నువ్వు ఈ మార్గమున ప్రవేశించావు. తెలియని వారు ధనము గూర్చి, అధికారం కోసం పాటుపడతారు.కానీ అవి యెంత కాలం వున్న ఒక్క జన్మం లో విడిచిపోతాయి. కాబట్టి అవి అసత్తులు. సత్తులును, నిత్యములును అయి వీని కంటే అధికమైన వస్తువులు వున్నాయి. ఒక సారి చూస్తే నువ్వు ఇక ఇతర వస్తువులను కోరవు.
ప్రపంచం లోని మనుష్యులు రెండు రకాలు. తెలిసిన వారు, తెలియని వారు. ఈ తెలివి ఒక్కటే ముఖ్యమైనది. ఏ మతం అవలంబించు వాడు, ఏ జాతి వాడు అనేది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది ఈ జ్నానమే. మానవులను గురించి ఈశ్వరుడు చేసిన కట్టుబాటు ఇట్టిదని తెలిసుకోవటమే జ్నానం. భగవంతుడే అట్టి కట్టుబాటు చేసి వున్నాడు. అదే ప్రపంచ పురోవృధ్ధికి మార్గం. ఎవరైనా ఆ మార్గమిట్టిదని చూచి వాస్తవంగా తెలుసుకుంటే, అతి తేజో వంతము, అతి రమణీయం అయిన ఆ మార్గం లో పాటుపడి ఆ మార్గముతో ఏకీభవించకుండా వుండడు.ఇలా తెలుసుకోవటం వల వాడు భగవంతుని పక్షమున చెరును. ధర్మం అవలంబించి అధర్మం నేదిరించును. లోకం యొక్క శ్రేయస్సు కోసం పాటు పడతాడు. స్వప్రోయోజనమును కోరుకోడు.
ఇలా భగవంతుని పక్షమున వుంటే అతడు మాలో ఒక్కడు అవుతాడు. హిందువని, బౌద్ధుడు అని గాని, క్రైస్తవుడని గాని, మహమ్మదీయుడని గాని పేరు పెట్టుకున్నా, హిందు దేశ వాసి యైనా, ఆంగ్లేయ దేశ వాసి యైనా, చీనా దేశస్తుదైనా, రష్యా దేశపు వాడైనా భేదం కొంచెం కూడా లేదు. భగవంతుని పక్షమున వుండే వాళ్ళు ఏ కారణము తో ఈ లోకానికి వచ్చారో తామేమి చేయాలో దాని ని తెలుసుకొని దానిని చేయపూనుకుంటారు. తక్కిన వారంతా తామేమి చేయాలో దానిని ఇంకా తెలుసుకోకపోవటం చేత తరచుగా అవివేకంగా నటిస్తూ , అందరూ ఒక్కటే అని, ఒక్కడే అయిన భగవంతుడి ఇచ్ఛయే ఎపుడూ గాని అందరికీ యథార్థంగా ప్రియంగా వుండదని తెలుసుకోలేక, తమకు మాత్రం ప్రియమని తోచు మార్గాల్నీ కల్పించేందుకు పూనుకుంటారు. అట్టి వారందరూ అసత్తును అనుసరించు వారలు గాని సత్తు ననుసరించుట లేదు. ఈ రెంటికి వున్న తేడా తెలుసుకునేంత వరకూ వారు భగవంతుని పక్షమున చేరినవారు కారు. కాబట్టి ఈ వివేకం మొదటి మెట్టు.
(సశేషం)
ఇందులో రాసినవి నా మాటలు కావు. నాకుపదేశించిన పరమ గురువు మాటలు. వారు లేక పోతే నేనేమీ చేసి వుండలేను, గాని వారి సహాయము చే నేను మోక్ష మార్గమును ప్రవేశించాను. నువ్వు అదే మార్గం ప్రవేశింప ఇచ్చ గలవాడవు. కాబట్టి వారు నాకుపదేశించిన వాక్కులు నీకు కూడా సహాయంగా వుండును.ఆ మాటలను అనుష్టించాలి సుమా! ఆ మాటలు సత్యములని, రమణీయములని చెపితే సరిపోదు. చెప్పిన ప్రాకారం జవదాటక అనుష్టించిన గాని నువ్వు కడతేరజాలవు. ఆహారాన్ని చూచి అది బాగుగా వున్నదనుటచే ఆకలిగొన్న వాని ఆకలి తీరదు. చేయి చాచి ఆ అన్నం తినాలి కదా. అట్లానే పరమ గురువుల వాక్కులు వినటం చాలదు. వారు చెప్పే ఒక్కొక్క మాట గమనించి వారు సూచించు ఒక్కొక్క అంశాన్ని గ్రహించి వారు చెప్పినట్లు నడుచుకోవాలి. వారి సూచనల్లో ఒక్కటి గ్రహించకపోయినా, వారి మాటల్లో ఒక్కటి విడిచినా, అది యెప్పటికిని పోయినదే. వారు చెప్పినది మరల చెప్పారు సుమా.
ఈ మార్గమున నాలుగు సాధనాలున్నవి.
1. వివేకం. 2. నిష్కామత్వం ( విరాగం) 3. సదాచారం 4. ప్రేమ. వీనిలో ఒకొక్కదానిని గురించి నాకు పరమ గురువు ఏం ఉపదేశించారో దాన్ని మీకు చెప్తాను.
వివేకం
ఇందులో మొదటి సాధనం వివేకం. ఇది మోక్ష మార్గమున చేర్చు సదసద్వివేకమని కూడా అంటారు. ఇది సరియైనదే. అయినా దీని లో మరి కొంత గొప్ప విశేషముంది. ఆ మార్గారంభమునే కాదు, అడుగడుగునా ప్రతి దినం అభ్యసింపదగినది. పొండదగిన వస్తువులన్నీ ఆ మార్గమునే లభిస్తాయని నేర్చుకున్నావు కాబట్టే నువ్వు ఈ మార్గమున ప్రవేశించావు. తెలియని వారు ధనము గూర్చి, అధికారం కోసం పాటుపడతారు.కానీ అవి యెంత కాలం వున్న ఒక్క జన్మం లో విడిచిపోతాయి. కాబట్టి అవి అసత్తులు. సత్తులును, నిత్యములును అయి వీని కంటే అధికమైన వస్తువులు వున్నాయి. ఒక సారి చూస్తే నువ్వు ఇక ఇతర వస్తువులను కోరవు.
ప్రపంచం లోని మనుష్యులు రెండు రకాలు. తెలిసిన వారు, తెలియని వారు. ఈ తెలివి ఒక్కటే ముఖ్యమైనది. ఏ మతం అవలంబించు వాడు, ఏ జాతి వాడు అనేది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది ఈ జ్నానమే. మానవులను గురించి ఈశ్వరుడు చేసిన కట్టుబాటు ఇట్టిదని తెలిసుకోవటమే జ్నానం. భగవంతుడే అట్టి కట్టుబాటు చేసి వున్నాడు. అదే ప్రపంచ పురోవృధ్ధికి మార్గం. ఎవరైనా ఆ మార్గమిట్టిదని చూచి వాస్తవంగా తెలుసుకుంటే, అతి తేజో వంతము, అతి రమణీయం అయిన ఆ మార్గం లో పాటుపడి ఆ మార్గముతో ఏకీభవించకుండా వుండడు.ఇలా తెలుసుకోవటం వల వాడు భగవంతుని పక్షమున చెరును. ధర్మం అవలంబించి అధర్మం నేదిరించును. లోకం యొక్క శ్రేయస్సు కోసం పాటు పడతాడు. స్వప్రోయోజనమును కోరుకోడు.
ఇలా భగవంతుని పక్షమున వుంటే అతడు మాలో ఒక్కడు అవుతాడు. హిందువని, బౌద్ధుడు అని గాని, క్రైస్తవుడని గాని, మహమ్మదీయుడని గాని పేరు పెట్టుకున్నా, హిందు దేశ వాసి యైనా, ఆంగ్లేయ దేశ వాసి యైనా, చీనా దేశస్తుదైనా, రష్యా దేశపు వాడైనా భేదం కొంచెం కూడా లేదు. భగవంతుని పక్షమున వుండే వాళ్ళు ఏ కారణము తో ఈ లోకానికి వచ్చారో తామేమి చేయాలో దాని ని తెలుసుకొని దానిని చేయపూనుకుంటారు. తక్కిన వారంతా తామేమి చేయాలో దానిని ఇంకా తెలుసుకోకపోవటం చేత తరచుగా అవివేకంగా నటిస్తూ , అందరూ ఒక్కటే అని, ఒక్కడే అయిన భగవంతుడి ఇచ్ఛయే ఎపుడూ గాని అందరికీ యథార్థంగా ప్రియంగా వుండదని తెలుసుకోలేక, తమకు మాత్రం ప్రియమని తోచు మార్గాల్నీ కల్పించేందుకు పూనుకుంటారు. అట్టి వారందరూ అసత్తును అనుసరించు వారలు గాని సత్తు ననుసరించుట లేదు. ఈ రెంటికి వున్న తేడా తెలుసుకునేంత వరకూ వారు భగవంతుని పక్షమున చేరినవారు కారు. కాబట్టి ఈ వివేకం మొదటి మెట్టు.
(సశేషం)
Subscribe to:
Posts (Atom)